ప్రధాని మోడీతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ బేటీ

by Disha Web Desk 12 |
ప్రధాని మోడీతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ బేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. మంగళవారం రాత్రి న్యూయార్క్ సిటీలో టెస్లా సీఈఓ, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌తో బేటి అయ్యారు. ఈ సమావేశం అనంతరం మస్క్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను మోదీ అభిమానిని అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోడీతో నాకు ఇది అద్భుతమైన సమావేశం, నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం మా ఫ్యాక్టరీని సందర్శించారు. కాబట్టి, మేము ఒకరికొకరు కొంతకాలంగా తెలుసు" అని మస్క్ చెప్పారు.

"భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికి లేనంత వాగ్దానం భారతదేశానికి ఉందని నేను భావిస్తున్నాను." "ప్రధానమంత్రి మోడీ భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు, ఎందుకంటే భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆయన ప్రోత్సాహంతో భారత్‌లో పెట్టుబడులు పెడతామని సమావేశం అనంతరం ట్విట్టర్ ద్వారా పేర్కోన్నారు.

Also Read..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో సందేశం

Next Story